కరోనా సోకిన వ్యక్తి ఆత్మహత్య

by  |
కరోనా సోకిన వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, పాలకుర్తి: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం మడిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. కరోనా పాజిటివ్ వచ్చిన మోతే జనార్దన్ రెడ్డి(52) అనే వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మోతే జనార్దన్ రెడ్డి జీవనోపాధి కోసం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదులో నివాసం ఉంటున్నాడు. ఇతనికి హైదరాబాదులో నిన్న టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మనస్తాపానికి గురైన బాధితుడు కుటుంబ సభ్యులకు ఎవరికీ చెప్పకుండా రాత్రి స్వగ్రామమైన మడిపల్లి చేరుకున్నాడు. ఇతడు వచ్చిన విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై, ఎమ్మార్వో ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. బాధితుడు ఈ రోజు తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story