తెలంగాణలో కరోనా @1430

by  |
తెలంగాణలో కరోనా @1430
X

దిశ, వెబ్ డెస్క్ :
రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం తెలంగాణలో తాజాగా 1,430 కేసులు నమోదవ్వగా, ఏడుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 47,705కు చేరింది. ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య మొత్తంగా 429కు చేరింది. ఈరోజు గ్రేటర్ పరిధిలో 703 కేసులు పాజిటివ్ వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 10,891 పాజిటివ్ కేసులుండగా, 36,385 మంది కరోనాతో పోరాడి డిశ్చార్జి అయ్యారు. కాగా, నేడు కొత్తగా 16,855 కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2లక్షల93వేల 77మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.



Next Story

Most Viewed