లాల్ దర్వాజా మహంకాళి ఆలయం మూసివేత

by  |
లాల్ దర్వాజా మహంకాళి ఆలయం మూసివేత
X

దిశ, వెబ్ డెస్క్ : పాత బస్తీ లోని పురాతనమైన లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రధాన పూజారులు ఇద్దరు కరోనా బారిన పడ్డారు. ఈ కారణంగా పది రోజుల పాటు ఆలయంలోకి భక్తుల ప్రవేశానికి అనుమతి లేదని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. ఆలయ పూజారులు నర్సింహయ్య, రామకృష్ణ ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ ఉన్నట్లు శనివారం తేలిందన్నారు. ఈ క్రమంలో ఆదివారం నుంచి పది రోజుల పాటు భక్తులెవరూ అమ్మవారి దర్శనానికి రాకూడదని సూచించారు.

Next Story