- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరులోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలపై కరోనా పంజా విసిరింది. బాపట్ల నియోజకవర్గంలోని రెండు ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులు.. ఒక ఉపాధ్యాయుడు కరోనా బారినపడ్డారు. అలాగే బాపట్ల మండలం నరసాయపాలెంలోని బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినిలు, తొమ్మిదో తరగతి చదువుతున్న మరో విద్యార్థిని.. మెుత్తం ఐదుగురుకు కరోనా సోకింది. దీంతో అప్రమత్తమైన […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలపై కరోనా పంజా విసిరింది. బాపట్ల నియోజకవర్గంలోని రెండు ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులు.. ఒక ఉపాధ్యాయుడు కరోనా బారినపడ్డారు.
అలాగే బాపట్ల మండలం నరసాయపాలెంలోని బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినిలు, తొమ్మిదో తరగతి చదువుతున్న మరో విద్యార్థిని.. మెుత్తం ఐదుగురుకు కరోనా సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, మిగిలిన విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అలాగే పాఠశాలల్లో పారిశుధ్య పనులు చేపట్టారు.
Next Story






