ఏపీలో 7,147కు చేరిన కరోనా మరణాలు

by  |
ఏపీలో 7,147కు చేరిన కరోనా మరణాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 43,770మందికి పరీక్షలు నిర్వహించగా 158మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,86,852కు చేరింది. ఒకరు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,147గా ఉంది. ప్రస్తుతం 1,473 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,78,23మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో కరోనా నుంచి 172 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,28,31,731మందికి శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 11 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణ కాగా చిత్తూరులో 10, తూర్పుగోదావరిలో 35, గుంటూరులో 12, కడపలో 7, కృష్ణా జిల్లాలో 23, కర్నూలులో 5, నెల్లూరు 1, ప్రకాశం 2, శ్రీకాకుళం 5, విశాఖపట్నం 18, విజయనగరం 1, పశ్చిమగోదావరి జిల్లాలో 28 కేసులు వచ్చాయి. కరోనా మహమ్మారి బారిన పడి విశాఖపట్నంలో ఒకరు చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.


Next Story

Most Viewed