- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నావెల్ కరోనా వైరస్ కారణంగా కలిగిన మరణాల సంఖ్య, 2002-03 మధ్యలో ప్రబలిన సార్స్ వైరస్ మరణాలను దాటేశాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం చైనా ప్రధాన భూభాగంలో 811 మంది మృత్యువాతపడ్డారు. అయితే ఈ వైరస్ దాడిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతం వైరస్ దాడి సద్దుమణుగుతోందని తెలిపింది.
ఆదివారం నాటి అధికారిక లెక్కల ప్రకారం 89 మంది కొత్తగా ఈ వైరస్ బారిన పడ్డట్లు తెలుస్తోంది. వీళ్లందరూ వైరస్ పుట్టిన వుహాన్ లోని హుబేయి ప్రావిన్స్కే చెందినవారు. అయితే శనివారం నాటి నివేదికతో పోల్చితే ఆదివారం నాడు తక్కువ మందే కొత్తగా ఈ వ్యాధి బారిన పడ్డట్లు సమాచారం. సార్స్ వైరస్ అప్పట్లో 774 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే.
Next Story