సార్స్‌ను దాటేసిన కరోనా

by  |

నావెల్ కరోనా వైరస్ కారణంగా కలిగిన మరణాల సంఖ్య, 2002-03 మధ్యలో ప్రబలిన సార్స్ వైరస్ మరణాలను దాటేశాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం చైనా ప్రధాన భూభాగంలో 811 మంది మృత్యువాతపడ్డారు. అయితే ఈ వైరస్ దాడిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతం వైరస్ దాడి సద్దుమణుగుతోందని తెలిపింది.

ఆదివారం నాటి అధికారిక లెక్కల ప్రకారం 89 మంది కొత్తగా ఈ వైరస్ బారిన పడ్డట్లు తెలుస్తోంది. వీళ్లందరూ వైరస్ పుట్టిన వుహాన్ లోని హుబేయి ప్రావిన్స్‌‌కే చెందినవారు. అయితే శనివారం నాటి నివేదికతో పోల్చితే ఆదివారం నాడు తక్కువ మందే కొత్తగా ఈ వ్యాధి బారిన పడ్డట్లు సమాచారం. సార్స్ వైరస్ అప్పట్లో 774 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed