ఏపీలో 6వేలు దాటిన కరోనా మరణాలు

by  |
ఏపీలో 6వేలు దాటిన కరోనా మరణాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. 10రోజుల ముందు వరకు 10వేలకు పైగా నమోదైన పాజిటివ్‌ కేసులు నిన్నటివరకు 5వేలకు పైగా నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 56,145 మందికి పరీక్షలు నిర్వహించగా 4,256మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,23,512కి చేరింది. 38మరణాలు సంభవించడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,019గా ఉంది. ప్రస్తుతం 51,060 యాక్టివ్ కేసులు ఉండగా చికిత్స తీసుకొని 6,66,433మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 7,558 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 61లక్షల 50వేల 351 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి కృష్ణా జిల్లాలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా కడప జిల్లాలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, అనంతపురంలో నలుగురు, విశాఖ జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విజయనగరంలో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 271 పాజిటివ్ కేసులు నమోదు కాగా, చిత్తూరులో 224, తూర్పుగోదావరిలో 853, గుంటూరులో 444, కడపలో 231, కృష్ణా జిల్లాలో 179, కర్నూలులో 86, నెల్లూరులో 365, ప్రకాశంలో 666, శ్రీకాకుళంలో 157, విశాఖపట్నంలో 138, విజయనగరంలో 129, పశ్చిమగోదావరి జిల్లాలో 513 కేసులు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ సోమవారం వెల్లడించింది.



Next Story

Most Viewed