జీహెచ్ఎంసీ ఆఫీసులో కరోనా కలకలం

by  |
జీహెచ్ఎంసీ ఆఫీసులో కరోనా కలకలం
X

దిశ, ఎల్బీనగర్: ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలోని సర్కిల్-5 టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన గత పది రోజుల నుంచి అస్వస్థతతో బాధపడుతున్నట్లు సహోద్యోగులు తెలిపారు. రెండు రోజుల క్రితం శ్రీధర్ కార్యాలయానికి వచ్చినప్పుడు ఉన్నత స్థాయి అధికారులు కలుగజేసుకుని కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

Next Story

Most Viewed