రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రోజూ వెయ్యికి చేరువలో నమోదు అవుతూ, రాష్ట్ర ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,018 కేసులు నమోదు అయ్యాయి. మరో ఏడుగురు వైరస్ బారిన పడి మృతిచెందారు. దీంతో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 17,357కు చేరింది. కాగా ఇప్పటివరకూ మృతిచెందిన వారి సంఖ్య 267గా నమోదైంది. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య [&hellip;]</p>

రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రోజూ వెయ్యికి చేరువలో నమోదు అవుతూ, రాష్ట్ర ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,018 కేసులు నమోదు అయ్యాయి. మరో ఏడుగురు వైరస్ బారిన పడి మృతిచెందారు. దీంతో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 17,357కు చేరింది. కాగా ఇప్పటివరకూ మృతిచెందిన వారి సంఖ్య 267గా నమోదైంది. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 8,082 కు చేరింది. 9,003 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చికిత్స పొందుతున్నారు. అయితే కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఇవాళ 881 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం ఇప్పటివరకూ హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,563కు చేరడం గమనార్హం.

Next Story