ఏపీలో 8లక్షల 72వేలు దాటిన కరోనా కేసులు

by  |
ఏపీలో 8లక్షల 72వేలు దాటిన కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 56,187మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 551 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8లక్షల 72వేల 839కి చేరింది. నలుగురు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 7,042గా ఉంది. ప్రస్తుతం 5,429 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8లక్షల 60వేల 368మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 744మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,05,09,805 మందికి శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 8, చిత్తూరులో 76, తూర్పుగోదావరిలో 57, గుంటూరులో 89, కడపలో 18, కృష్ణా జిల్లాలో 108, కర్నూలులో 3, నెల్లూరులో 35, ప్రకాశంలో 18, శ్రీకాకుళంలో 34, విశాఖపట్నంలో 36, విజయనగరంలో 11, పశ్చిమగోదావరిలో 58 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Next Story

Most Viewed