ఢిల్లీలో కరోనా విజృంభణ

by  |
ఢిల్లీలో కరోనా విజృంభణ
X

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 80వేల టెస్టులు నిర్వహించగా 3,419 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 5,89,544లకు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 28,252గా ఉన్నది. తాజాగా 77 మంది మృతిచెందడంతో మృతుల సంఖ్య 9,574కు చేరుకున్నది. మొత్తం 81,473 టెస్టులు చేశామని, ఇందులో 35,352 ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు ఉన్నాయిని, పాజిటివ్ రేటు 4.2శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు.


Next Story