దేశంలో మళ్లీ 40 వేలు దాటిన కరోనా కేసులు

by  |
carona 1
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. మరో సారి కరోనా కేసుల సంఖ్య 40 వేల మార్క్ దాటింది. గడిచిన 24 గంటల్లో 41,195 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,20,77,706 కోట్లకు చేరింది. అలాగే నిన్న కరోనాతో 490 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,29,669 చేరింది. నిన్న కరోనాతో 39,069 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,12,60,050కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,87,987యాక్టివ్ కేసులు ఉండగా అందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నారు.

Next Story

Most Viewed