ఏలూరు జైలులో కరోనా కలకలం

by  |
ఏలూరు జైలులో కరోనా కలకలం
X

దిశ, ఏపీబ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు జైలులో కరోనా కలకలం సృష్టించింది.ఇప్పటికే జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఆ మహమ్మారి కాస్త జైళ్లకు కూడా వ్యాప్తి చెందుతోంది. దాదాపు 13 మంది రిమాండ్ ఖైదీలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యినట్లు సమాచారం. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనతో జైలులోని 77 మంది అధికారులు కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అయితే, ఫలితాలు ఇంకా వెలువడలేదు. రిమాండ్ ఖైదీలకు కరోనా సోకడంతో ఇతర ఖైదీల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి.

Next Story

Most Viewed