- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 57,685మందికి శాంపిల్స్ పరీక్షించగా 9,742 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,003కి చేరింది. తాజాగా 86మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 2,906గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 86,725 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 2,26,372మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది.
చిత్తూరు జిల్లాలో కరోనాతో 15మంది ప్రాణాలు కోల్పోగా నెల్లూరు జిల్లాలోనూ 15 మంది కరోనా బారిన పడి మృతిచెందారు. అనంతపురంలో 8మంది, గుంటూరులో ఏడుగురు, ప్రకాశంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, కడపలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు కరోనా మహమ్మారితో చనిపోయారు.
అనంతపురం జిల్లాలో 1,123 పాజిటివ్ కేసులు నమోదు కాగా, చిత్తూరు 830, తూర్పుగోదావరి 1,399, గుంటూరు 555, కడప 673, కృష్ణా 281, కర్నూలు 794, నెల్లూరు 755, ప్రకాశం 585, శ్రీకాకుళం 565, శ్రీకాకుళం 565, విజయనగరం 428, పశ్చిమగోదావరి జిల్లాలో 919 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 8,061 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 30లక్షల 19వేల 296 మందికి శాంపిల్స్ పరీక్షించినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది.