తెలంగాణలో లక్ష దాటిన కరోనా కేసులు

by  |
తెలంగాణలో లక్ష దాటిన కరోనా కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య లక్ష దాటింది. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 2,474 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,01,865 కు చేరింది. ఇందులో 78,735 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 22,386 మంది బాధితులు ఇంకా కరోనాతో పోరాడుతునే ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రాంలో కరోనాతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 744కు చేరింది. అలాగే, తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ-447 కేసులు నమోదయ్యాయి.



Next Story

Most Viewed