ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

by  |
ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధప్రదేశ్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఏమాత్రం తగ్గకుండా రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 5,041 పాజిటివ్ కేసులు వచ్చాయంటే వైరస్ ఉధృతి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 49,650కి చేరింది.

ఇవాళ 56 మంది చనిపోయారు. ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 642కు చేరింది. ఇవాళ 1,106 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 26,118గా ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 13లక్షల 15వేల 532మంది మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Next Story

Most Viewed