ఆస్పత్రిలో మృతదేహాల కుప్ప

by  |
ఆస్పత్రిలో మృతదేహాల కుప్ప
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో ఆ మృతదేహాలను ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. అయితే.. ఆ మృతదేహాలను వారి కుటుంబ సభ్యులెవరూ కరోనా భయంతో తీసుకపోవడంలేదు. దీంతో మృతదేహాలు మార్చురీలో పేరుకుపోయాయి. ప్రస్తుతం మార్చురీలో 30కి పైగా మృతదేహాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఆస్పత్రి వర్గాలు తర్జనభర్జన పడుతూ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.


Next Story