కరోనాతో కానిస్టేబుల్ మృతి

by  |
కరోనాతో కానిస్టేబుల్ మృతి
X

దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కొహెడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న భీమ్(50)అనే పోలీస్ కానిస్టేబుల్ కరోనాతో ఆదివారం మృతి చెందాడు. భీమ్‌కు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడతో అతను ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచినట్లు సహచర పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య ఓ కూతురు, కుమారుడు వున్నట్లు ఎస్ఐ రాజకుమార్ తెలిపారు. భీమ్ మృతితో కుటుంబ సభ్యులు, తోటి సహచరులు, పలువురు ప్రజాప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed