భార్య చేసిన పని తట్టుకోలేక.. కానిస్టేబుల్ ఆత్మహత్య

by  |
భార్య చేసిన పని తట్టుకోలేక.. కానిస్టేబుల్ ఆత్మహత్య
X

దిశ ,ఇల్లందు: కొత్తగూడెం ఆరవ బెటాలియన్ చెందిన టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఇల్లందు జెకె కాలనీ SD 260 క్వాటర్స్‌లో నివాసముంటున్న పళ్ళ రాంబాబు కొత్తగూడెం‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే గత కొంత కాలం నుంచి రాంబాబుకు తన భార్యకు గొడవలు జరుగుతున్నాయి. భార్య భర్తల కలహాలతో గత ఆరు నెలలుగా ఉద్యోగం చేయకపోవడంతో భార్య పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో మనస్తాపం చెందిన రాంబాబు తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed