- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ దిశగా ప్రియాంక గాంధీ ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. యూపీలో శనివారం నుంచి మూడు ప్రతిజ్ఞ యాత్రలను ప్రారంభిచనున్నారు. సహరాన్ పూర్-మథుర, బారాబంకీ-బుందేల్ ఖండ్, వారణాసి-రాయ్ బరేలీ మీదుగా ఈ యాత్రలు కొనసాగనున్నాయి. ఈ యాత్రలు వచ్చే నెల 1 వరకు నిర్వహించనున్నారు.
అదేవిధంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 31న యూపీలో 2 లక్షల మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. వారణాసిలో ఇటీవల ప్రియాంక గాంధీ భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ గోరఖ్ పూర్ లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.