పెట్రో మంట.. జూన్ 11న కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు

by  |
పెట్రో మంట.. జూన్ 11న కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇంధన ధరలు దేశ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెట్రో ధరలు సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా.. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. నిరసనల్లో భాగంగా జూన్ 11న పెట్రోల్​ బంక్‌ల ఎదుట కాంగ్రెస్​ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టనున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పెరుగుతున్న పెట్రో ధరలపై కేంద్రాన్ని విమర్శించిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో సామాన్య ప్రజలపై పెట్రో ధరల పెరుగుదల కారణంగా మరింత భారం పడుతుందని ఆరోపించారు.


Next Story

Most Viewed