ప్రతి ప్రాజెక్టులో కేటీఆర్‌కు కమీషన్ : మాణిక్యం ఠాకూర్

by  |
ప్రతి ప్రాజెక్టులో కేటీఆర్‌కు కమీషన్ : మాణిక్యం ఠాకూర్
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో అవినీతి ప్రభుత్వం ఉందని కేంద్ర మంత్రి జవదేకర్ అన్నారనీ…అలాంటప్పుడు అవినీతిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మోడీ, కేసీఆర్,జగన్ అందరూ ఒక్కటే అని అన్నారు. గల్లీలో కుస్తీ పడతారు…ఢిల్లీలో దోస్తీ చేస్తారని అన్నారు. ప్రతీ ప్రాజెక్టు పనిలో కేటీఆర్‌కు కమీషన్ వెళుతుందని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు దమ్ముంటే కేటీఆర్ పై సీబీఐ కేసులు పెట్టాలన్నారు. మతం పేరుతో బీజేపీ ఓట్లు దండుకోవాలని చూస్తోందన్నారు. సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మైత్రీ స్పష్టంగా అర్థమవుతోందన్నారు.


Next Story

Most Viewed