ఫేస్బుక్ సీఈవోకి కాంగ్రెస్ లేఖ 

by  |
ఫేస్బుక్ సీఈవోకి కాంగ్రెస్ లేఖ 
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీకి ఫేస్బుక్ వత్తాసు పలుకుతోందని కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఫేస్బుక్ పై పార్లమెంటరీ స్థాయి విచారణ చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్ కు ప్రతిపక్షాల మద్దతు కూడా ఉందంటూ కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

భారతదేశంలో 40 కోట్లమంది ఫేస్బుక్ (facebook), వాట్సాప్ (whatsapp) యూజర్లు ఉన్నారు. కోట్లమంది నమ్మకాన్ని తిరిగి పొందాలంటే నిష్పాక్షికంగా విచారణ జరగాల్సిందేనంటూ బలంగా గళమెత్తుతోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కు లేఖ రాసింది. భారతీయులంతా ఫేస్బుక్ నిజాయితీని ప్రశ్నిస్తున్నారంటూ లేఖలో పేర్కొంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed