టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ కౌన్సిలర్లు

by  |
టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ కౌన్సిలర్లు
X

దిశ, మహబూబ్‌నగర్: ఓ వైపు ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారి బారిన పడి అతలాకుతలం అవుతుంటే.. మరో వైపు నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీలు మారే పనిలో పడ్డారు. తాజాగా మహబూబ్‌నగర్ మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్‌లో చేశారు. శుక్రవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ర్టంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే మున్సిపాలిటీకి 11, 41 వార్డు కౌన్సిలర్లు, శ్రీనివాసులు, రఫియా బేగం టీఆర్ఎస్ చేరారని తెలిపారు.



Next Story

Most Viewed