- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, న్యూస్బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్లు మాటల మాంత్రికులు తప్పా చేతలు లేవని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ విమర్శించారు. మోడీ పాకిస్తాన్ పాస్ట్ బౌలర్ లాంటి వాడైతే.. కేసీఆర్ శ్రీలంక బౌలర్ మలింగ లాంటి వాడని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాములు నాయక్ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల ముందు దేశాన్ని 2020లో ప్రపంచంలో అగ్రగామిగా నిలుపుతానన్నా మోడీ.. కరోనా వైరస్ వ్యాప్తిలో అగ్రగామిగా నిలిపారన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా పెద్ద ఎత్తున్న విస్తరించే ఆవకాశం ఉందని హెచ్చరిస్తున్నప్పటికీ మోడీ నమస్తే ట్రంప్ కార్యక్రమం పెట్టారని విమర్శించారు. చైనా కంటే భారత్లో కేసులు ఎక్కుగా వచ్చాయని తెలిపారు. నమస్తే ట్రంప్ కార్యక్రమంలో విదేశీ విమానాలు రాకుంటే కరోనా కేసుల సంఖ్య ఇంతగా ఉండేది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ధనికుల ద్వారా వచ్చిన వైరస్ పేదలకు అంటిచారన్నారు. సీఎం కేసీఆర్ ప్రధానితో పోటిపడి లాక్డౌన్ రోజులు పెంచాడన్నారు. మోడీ కంటే తెలివైన వాడినని ప్రధానిని అయితానని కేసీఆర్ పగటికలలు కంటున్నాడని రాములు నాయక్ ఎద్దేవా చేశారు.