మమ్మల్ని బతకనివ్వరా.. ఎమ్మెల్యే మేనల్లుడిని కాల్చి చంపిన దుండగులు

by  |
మమ్మల్ని బతకనివ్వరా.. ఎమ్మెల్యే మేనల్లుడిని కాల్చి చంపిన దుండగులు
X

దిశ,వెబ్‌డెస్క్: బీహార్ లోని ససారాంలో దారుణం జరిగింది. కార్గహర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతోష్ మిశ్రా మేనల్లుడిని బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు కాల్చి చంపారు. సంజీవ్ మిశ్రా పార్సతువాలోని తన నివాసం నుండి బయటకు వస్తున్నప్పుడు దుండగులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన స్థానికులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా.., మార్గం మధ్యంలోనే మరణించారు.

కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కాల్పులకు కారణం పాత కక్షలే కారణమని అనుమానిస్తున్నారు. సంజీవ్ మిశ్రా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సదర్ ఆసుపత్రికి తరలించారు.

ముందు జాగ్రత్త చర్యల్లో డీఎస్పీ వినోద్ కుమార్ రావత్ పార్సతువా గ్రామంలో భారీ ఎత్తున పోలీసుల్ని మోహరించారు. ఈ సందర్భంగా మేనల్లుడి హత్యపై ఎమ్మెల్యే సంతోష్ మిశ్రా ప్రభుత్వంపై మండిపడ్డారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు భయాందోళనను కలిగిస్తున్నాయి. తరుచుగా నా నియోజకవర్గంలోనే హత్యలు జరుగుతున్నాయి. “ఈ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు సురక్షితంగా లేనప్పుడు, సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? ఓ వైపు ప్రజలు కల్తీ మద్యంతాగి చనిపోతున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతోష్ మిశ్రా ఆందోళన వ్యక్తం చేశారు.


Next Story