రాష్ట్రంలో హైదరాబాద్ ఒక్కటే ఉందా?

by  |
Congress MLA Jagga Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మట్లాడుతూ.. అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షాలకు హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు కూడా తీవ్ర నష్టపోయాయని వెల్లడించారు. వరదలతో నష్టపోయిన జీహెచ్‌ఎంసీకి రూ.550 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో హైదరాబాద్ నగరం ఒక్కటే నష్టపోయిందా అని ప్రశ్నించారు. మిగిలిన ముప్పై జిల్లా పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, వ్యతిరేకత రాకుండా నిధులు విడుదల చేశారని ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed