రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని భిక్షాటన

by  |
రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని భిక్షాటన
X

దిశ, మునగాల: అధ్వాన్నంగా ఉన్న రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వినూత్నంగా భిక్షాటన చేపట్టారు. శుక్రవారం ఉదయం సూర్యాపేట జిల్లాలో నడిగూడెం నుంచి రత్నవరం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి మధ్య ఉన్న ప్రమాదకరమైన కుంట వద్ద ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేపూరి సుధీర్ మాట్లాడుతూ.. నడిగూడెం నుంచి చాకిరాల, రామచంద్రపురం నుంచి నాయకన్ గూడెం, నారాయణపురం నుంచి సిరిపురం వెళ్ళే ప్రధాన రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వర్టులు శిథిలమై ప్రమాదకరంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ రహదారులపై అనేక ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు కనీసం మరమ్మత్తులు కూడా చేపట్టడం లేదని ఆరోపించారు. మూల మలుపుల ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని కోరారు. పెను ప్రమాదాలు జరగముందే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ యాకోబ్, గణేష్, వంశీ, సైదులు, శ్రీరామ్, శ్రీకాంత్, మధు మహేష్ నాగేంద్రబాబు తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed