ఇందిరా గాంధీ, పటేల్‌కు కాంగ్రెస్ నేతల ఘన నివాళులు

by  |
ఇందిరా గాంధీ, పటేల్‌కు కాంగ్రెస్ నేతల ఘన నివాళులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వారికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ముందుగా నెక్లెస్ రోడ్‌లో ఇందిరా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీ ముందు ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

తర్వాత గాంధీభవన్‌లో ఇందిరా గాంధీ, వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్స్ గీతా రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, వంశీచంద్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు తదితరులు నివాళులర్పించారు.

Next Story