- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వారికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ముందుగా నెక్లెస్ రోడ్లో ఇందిరా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీ ముందు ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
తర్వాత గాంధీభవన్లో ఇందిరా గాంధీ, వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్స్ గీతా రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, వంశీచంద్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు తదితరులు నివాళులర్పించారు.
Next Story