‘బీజేపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతా’

by  |
Congress leader Rammohan
X

దిశ, వెబ్‌డెస్క్: తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అని పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ నేత రామ్మోహన్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరు కక్షగట్టి తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాగా, ఇవాళ కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమలతీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed