ప్రతీ సైనికుడికి నా సెల్యూట్ : రాహుల్

by  |
Rahul Gandhi
X

దిశ, వెబ్‌డెస్క్ : నియంత్రణ రేఖ (loc) వెంబడి నిన్న పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో భారత ఆర్మీ తన పోరాట ప్రతిమను చాటిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పాక్ దుశ్చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టిందని ప్రశంసించారు.

భారతీయ సైనికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారని, దాయాది పాక్‌కు తగిన బుద్ధి చెబుతున్నారని తెలిపారు. భారత జవాన్లు పండుగ సమయంలోనూ కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశాన్ని రక్షిస్తున్నారని.. ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న ప్రతీ సైనికుడికి నా సెల్యూట్ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇదిలాఉండగా, పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఐదుగురు భారత సైనికులు, ఆరుగులు పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed