- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు కాంగ్రెస్ నేత ఎంపీ కార్తీ చిదంబరం సలహా ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టంపై రజనీకాంత్ సీఏఏ చట్టం వల్ల ముస్లింలకు ఎలాంటి ప్రమాదం లేదని, ఒకవేళ అలా జరిగితే వారి తరపున పోరాడే మొదటి వ్యక్తిని తానే అవుతాననంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కార్తీ చిదంబరం మండిపడ్డారు. రజనీకాంత్ మోదీ ప్రభుత్వానికి మద్దతు పలకడం కంటే.. పార్టీ పేరిట చేస్తున్న నటనకు ఫుల్ స్టాప్ పెట్టి బీజేపీలో చేరిపోవాలని సలహా ఇచ్చారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు నటించేందుకు రజనీకి ఇక ఇలాంటి కారణం లేదని ఆయన ఎద్దేవా చేశారు. కాగా, ఈ మధ్య కాలంలో పెరియార్ పై రజనీ చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి, ఒక పరిశ్రమలో గాయపడినవారిని పరామర్శించడంపై సమన్లు జారీ అయ్యాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సీఏఏ, ఎన్నార్సీపై ఆయన వ్యాఖ్యలు తమిళనాట వివాదాస్పదమవుతున్నాయి.