ఆ ఉద్దేశ్యం టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు !

by  |
ఆ ఉద్దేశ్యం టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు !
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి విమర్శలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల రిజర్వేషన్‌ను సరిగా నిర్వహించడం లేదని, బీసీ ఓటర్ల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్ల కేటాయింపు జరగడం లేదని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేం అడిగిన సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయంగా ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో సర్వేల వల్ల ప్రజలకు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఓటర్లు అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed