బీజేపీపై సర్జికల్ స్ట్రైక్ చేయాలి

by  |
బీజేపీపై సర్జికల్ స్ట్రైక్ చేయాలి
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ తనపై తాను కాకుండా బీజేపీపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. ఇటీవల పార్టీలో ఏర్పడిన పరిస్థితులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. యూపీ కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద్‌పై ఓ జిల్లా యూనిట్ చేసిన తీర్మానంపై ఆయన ట్వీట్ చేశారు. జితిన్ ప్రసాద్ యూపీలో టార్గెట్ అవుతుండటం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ తనను తాను టార్గెట్ చేసుకుంటూ శక్తిని వృథా చేయడానికి బదులుగా బీజేపీని టార్గెట్ చేయడం అవసరం అన్నారు. ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాసిన 23మందిలో జితిన్ ప్రసాద్ ఉన్నారు.



Next Story

Most Viewed