ఎన్నికలు వస్తేనే టీఆర్ఎస్‌కు అభివృద్ధి గుర్తుకు వస్తుంది :జానారెడ్డి

by  |
ఎన్నికలు వస్తేనే టీఆర్ఎస్‌కు అభివృద్ధి గుర్తుకు వస్తుంది :జానారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జునసాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని తాము చేశామని టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికలు ఉంటేనే టీఆర్ఎస్‌కు అభివృద్ధి గుర్తుకు వస్తుందని చెప్పారు. ఉప ఎన్నిక కోసమే నెల్లికల్ లిఫ్ట్ పనులు ప్రారంభించారని విమర్శించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన టీఆర్ఎస్.. ఏడేళ్లు అయినా పూర్తి కాలేదని జానారెడ్డి పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పాలని అన్నారు.



Next Story

Most Viewed