టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పండి : గోదావరి

by  |
టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పండి : గోదావరి
X

దిశ, పటాన్‌చెరు: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సి.గోదావరి అంజిరెడ్డి అన్నారు. దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా తిమ్మాపూర్ గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంత రావు, అభ్యర్ధి చెరుకు శ్రీనివాసరెడ్డిలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ది జరిగిందని అన్నారు. మళ్లీ అదే విధంగా అభివృధి కావాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిచాలని తెలిపారు. నీళ్ళు, నిధులు, నియామకాలు కావాలంటే ప్రశ్నించే గొంతు కోసం కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని అన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపుతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని అన్నారు.


Next Story

Most Viewed