ఎమ్మెల్సీ బాలసాని నోరు అదుపులో పెట్టుకో: మణుగూరు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.డీ రషీద్

by  |
ఎమ్మెల్సీ బాలసాని నోరు అదుపులో పెట్టుకో: మణుగూరు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.డీ రషీద్
X

దిశ, మణుగూరు : ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మణుగూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.డీ రషీద్ అన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య గురించి మాట్లాడే టప్పుడు ఆలోచించి మాట్లాడాలన్నారు. సోమవారం మండలంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పొదేం వీరయ్య గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడని బాలసానిని హెచ్చరించారు. పొదేం వీరయ్యను విమర్శించే స్థాయి నీది కాదని ధ్వజమెత్తారు.

తెరాస పార్టీ అధికారంలో ఉన్నా, బాలసాని ఎమ్మెల్సీగా ఉండి భద్రాచలాన్ని ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. కేంద్రం పంపిన గ్రామపంచాయతీ నిధులతో సెంటర్ లైటింగ్, డివైడర్స్ నిర్మించి అభివృద్ధి చేశామని చెప్పుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. సీఎం కేసీఆర్ భద్రాద్రికి 100 కోట్ల ప్రకటించి మొఖం చాటేశారని గుర్తు చేశారు. కేసీఆర్ కి యాదాద్రి మీద ఉన్నప్రేమ భద్రాద్రి మీద ఎందుకు లేదని ప్రశ్నించారు.



Next Story