టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కాంగ్రెస్ నేత వాగ్వాదం

by  |
టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కాంగ్రెస్ నేత వాగ్వాదం
X

దిశ, వెబ్‌డెస్క్: ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో యువజన కాంగ్రెస్ నేత అనిల్ యాదవ్ వాగ్వాదానికి దిగారు. రెండ్రోజుల క్రితం సెల్లార్‌లో నిలిచిన వర్షం నీటిలో పడి హైకోర్టు ఉద్యోగి రాజ్‌కుమార్ మరణించగా.. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్టీ శ్రేణులతో కలిసి అనిల్ యాదవ్ వెళ్లాడు. ఈ క్రమంలోనే రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు… తమ గోడును చెప్పుకుంటూ జీహెచ్ఎంసీ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని, కరెంట్, తాగు నీరు సరఫరా చేయట్లేదని వాపోయారు. ఇదే సమయంలో ఆర్యవైశ్య సంఘ సమావేశానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరు కాగా.. తిరిగి వచ్చే సమయంలో అనిల్ కుమార్ నేతృత్వంలో ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగ్గారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి సెల్లార్‌లో నీటిని తొలగించాలని సూచించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.



Next Story

Most Viewed