ఎమ్మెల్యే పొదెంపై కాంగ్రెస్ నేత బూతు పురాణం..

by  |
ఎమ్మెల్యే పొదెంపై కాంగ్రెస్ నేత బూతు పురాణం..
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: పార్టీ మండ‌ల అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డంతో ఎమ్మెల్యే పొదెం వీర‌య్య‌పై భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అధ్య‌క్షుడు, పొశం వెంక‌టేశ్వ‌ర్లు అనే నేత బూతు పురాణం వినిపించారు. పోశం వెంక‌టేశ్వ‌ర్లు గ‌త ద‌శాబ్ద‌కాలంగా ఇల్లందు మండ‌ల కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు. వ‌ర్గ రాజ‌కీయాల‌కు అతీతుడిగా ఆయనకు పేరుంది. మండ‌ల రాజ‌కీయంలో కాస్త ప‌ట్టున్న నేత‌. అయితే ఇటీవ‌ల పార్టీ మండ‌ల క‌మిటీలో మార్పులు చేర్పులు జ‌రిగాయి. ఇందులో పులిసైదులును మండ‌ల పార్టీ నూత‌న అధ్య‌క్షుడిగా నియ‌మిస్తూ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు పొదెం వీర‌య్య ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆల‌స్యంగా తెలుసుకున్న పోశం వెంక‌టేశ్వ‌ర్లు ఆగ్ర‌హంతో ఊగిపోయాడు. శ‌నివారం రాత్రి 7గంట‌ల ప్రాంతంలో నేరుగా ఎమ్మెల్యే పొదెం వీర‌య్య‌కు ఫోన్ చేసి తిట్ల దండ‌కం మొద‌లుపెట్టాడు. ఎమ్మెల్యేను ఆయన అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తూ హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. త‌న‌ను ఎందుకు తొల‌గించారు, తొల‌గించ‌డానికి నువ్వెవ్వేడివి అంటూ…అనేక బూతు ప‌దాలు వాడుతూ ఎమ్మెల్యేపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. పొశం వెంక‌టేశ్వ‌ర్లుపై ఎమ్మెల్యే అట్రాసిటీ కేసు పెట్టడానికి సిద్ధ‌మైన‌ట్లుగా తెలుస్తోంది.

Next Story