టీఆర్ ఎస్ ఎమ్మెల్యేకు షాక్.. అడ్డుకున్న కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు..

by  |
టీఆర్ ఎస్ ఎమ్మెల్యేకు షాక్.. అడ్డుకున్న కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు..
X

దిశ, ఖమ్మం : రూరల్​ మండలం తల్లంపాడు భూ వివాదంలో అంతోటి శ్రీను ఆత్మహత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్​ చేయాలని శనివారం గ్రామంలో జరుగుతున్న టీఆర్​ఎస్​ పార్టీ మండల సర్వసభ్య సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డిని కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. నల్లజెండాలతో నిరసన తెలిపారు. గ్రామంలో గుండాలు రాజకీయం చేస్తున్నారని, అమాయకుల చావుకు కారణమైన వారిని వదిలిపెట్టి, గ్రామంలో సమావేశం ఏర్పాటు చేయడం సరికాదని ఆందోళనకారులు నినాదాలు చేశారు.

ప్రశాంతంగా ఉన్న గ్రామంలో కావాలనే చిచ్చుపెడుతున్నారని, ఇంకా ఎంత మందిచావుకు కారణమౌతారో ఎమ్మెల్యే కందాల తెలుసుకోవాలని విన్నవించారు. వెంటనే కాన్వయ్​ దిగిన ఎమ్మెల్యే కందాల బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆత్మహత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్​ చేపిస్తానని హమీ ఇచ్చారు. దాంతో ఆందోళనకారులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్​ యరసాని శివారెడ్డి, కళ్లెం వెంకటరెడ్డి, అంతోటి నవన్​, అంబేద్కర్​, ఆశోక్​ తదితరులు ఉన్నారు.



Next Story