- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కామారెడ్డి: భారత్ బంద్.. ఓ దాబాపై దాడికి ఉసిగొల్పింది. దాబా మూసివేయలేదని కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. బిక్కనూర్ మండలం సిద్ధరామేశ్వర్ నగర్ గ్రామ శివారులో ఉన్న బొండ్ల శేఖర్కు చెందిన దాబాపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. సోమవారం భారత్ బంద్ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పలు దుకాణాలను మూసివేయడానికి బయలుదేరారు. అందులో భాగంగా సిద్ధరామేశ్వర్ నగర్లో గల దాబా తెరిచి ఉండటంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాబా వద్ద ఉన్న కుర్చీలను ధ్వంసం చేశారు. కుర్చీలను విరగ్గొట్టి వీరంగం సృష్టించారు. దాంతో దాబా యజమాని శేఖర్కు కాంగ్రెస్ నాయకులకు కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకుల దాడికి సంబంధించిన దృశ్యాలు దాబాలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అనంతరం దాబా యజమాని శేఖర్ బిక్కనూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అలాగని దాబాపై దాడి చేయడం సరికాదన్నారు.