దాబాపై దాడికి ఉసిగొల్పిన భారత్ బంద్.. ఎక్కడంటే..?

by  |
దాబాపై దాడికి ఉసిగొల్పిన భారత్ బంద్.. ఎక్కడంటే..?
X

దిశ, కామారెడ్డి: భారత్ బంద్.. ఓ దాబాపై దాడికి ఉసిగొల్పింది. దాబా మూసివేయలేదని కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. బిక్కనూర్ మండలం సిద్ధరామేశ్వర్ నగర్ గ్రామ శివారులో ఉన్న బొండ్ల శేఖర్‌కు చెందిన దాబాపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. సోమవారం భారత్ బంద్ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పలు దుకాణాలను మూసివేయడానికి బయలుదేరారు. అందులో భాగంగా సిద్ధరామేశ్వర్ నగర్‌లో గల దాబా తెరిచి ఉండటంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాబా వద్ద ఉన్న కుర్చీలను ధ్వంసం చేశారు. కుర్చీలను విరగ్గొట్టి వీరంగం సృష్టించారు. దాంతో దాబా యజమాని శేఖర్‌కు కాంగ్రెస్ నాయకులకు కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకుల దాడికి సంబంధించిన దృశ్యాలు దాబాలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అనంతరం దాబా యజమాని శేఖర్ బిక్కనూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అలాగని దాబాపై దాడి చేయడం సరికాదన్నారు.


Next Story

Most Viewed