యువకుల మధ్య గొడవ.. కారణం లూడో గేమ్

by  |
యువకుల మధ్య గొడవ.. కారణం లూడో గేమ్
X

దిశ, మధిర: ఇద్దరు యువకుల మధ్య లూడో గేమ్ తో మొదలైన గొడవ ప్రాణాల మీదకు వచ్చింది. బోనకల్ రైల్వే స్టేషన్ సమీపంలో రాత్రి 10 గంటల సమయంలో మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. నాగేశ్వరరావు అనే వ్యక్తిపై గోపి అనే యువకుడు బీరు సీసాతో దాడి చేయడంతో మెడ ఛాతి భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. గతంలో కూడా గోపి అనే వ్యక్తిపై కేసులు ఉన్నట్టు సమాచారం. గాయపడిన వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed