మావోయిస్టుల్లో అభిప్రాయ విభేదాలు..!

by  |
మావోయిస్టుల్లో అభిప్రాయ విభేదాలు..!
X

దిశ, భద్రాచలం: మావోయిస్టుల మధ్య అభిప్రాయ భేదాలతో గత కొన్నిరోజులుగా పరస్పర ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ ప్రకటించారు.

ఇటీల జరిగిన ఈటోవర్ అడవుల్లో గంగలూరు ఏరియా కమిటీ కమాండ్ మొడియం దినేష్‎తో జరిగిన ఘర్షణలో వెస్ట్ బస్తర్ డీవీసీ మెంబర్ మొడియం విజ్జా మరణించినట్లు సమాచారం. విజ్జా కాకుండా జన మిలీషియా ప్లాటూన్ సెక్షన్ కమాండర్ సందీప్ @బుధారాం, జనతన సర్కార్ ఇన్‌చార్జి లఖు హేమ్లా, డీఏసీఎంఎస్ రేంజ్ కమిటీ అధ్యక్షుడు సంతోష్, జనతన సర్కార్ అధ్యక్షుడు దస్రు మండవి, మిలీషియా ప్లాటూన్ కమాండర్ పూనెం కమ్లు అనే మావోలు పరస్పర దాడుల్లో మృతి చెందినట్లు ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు. కాగా, ఈ విషయమై మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.

Next Story

Most Viewed