పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం

by  |
congress
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీఆర్ఎస్ నేతలు పోలింగ్ బూత్ వద్దకు వచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనకు దిగారు. పోలింగ్ బూత్‌లోకి కాంగ్రెస్ శ్రేణులు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట జరగడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Next Story

Most Viewed