ఇవాళ, రేపు, జూలై 3న మేం ఇలా చేస్తాం

by  |
ఇవాళ, రేపు, జూలై 3న మేం ఇలా చేస్తాం
X

దిశ, వెబ్ డెస్క్: పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వనున్నారు. అదేవిధంగా మంగళవారం జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి కరోనాను కట్టడి చేసే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కాలానికి సంబంధించి పేదల విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ జూలై 3న నల్లబ్యాడ్జీలు, జెండాలతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed