మురుగు కాలువ, రోడ్డు సమస్యకు నేటితో చెక్ : డీసీసీ ప్రధాన కార్యదర్శి

by  |
మురుగు కాలువ, రోడ్డు సమస్యకు నేటితో చెక్ : డీసీసీ ప్రధాన కార్యదర్శి
X

దిశ, పరిగి : కొంతకాలంగా మురుగు కాలువ, రోడ్డు సమస్య తీరిందని డీసీసీ ప్రధాన కార్యదర్శి కె.హన్మంతు ముదిరాజ్ పేర్కొన్నారు. పరిగి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఆదివారం మున్సిపల్ నిధులతో మురుగుకాలువ పై కప్పు , రోడ్డు పనులు ప్రారంభించారు. కొన్నేళ్లుగా ఈ రోడ్డు కింద మురుగుకాలువ జాం కావడం రోడ్డుపై కడీలు తీసి మురుగు వెళ్లేలా చేయడం ఇలా జరిగేది.ఈ సమస్యకు నేటితో శాశ్వత పరిష్కారం జరిగిందన్నారు. కాలనీవాసులు, ఈ రోడ్డుగుండా వెళ్లే ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పనుల ప్రారంబోత్సవ కార్యక్రమంలో నాయకులు మల్లేష్, రియాజ్, ఎర్రగడ్డపల్లి కృష్ణ కాలనీ వాసులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed