పోసాని కృష్ణమురళిపై పోలీసులకు ఫిర్యాదు

by Sridhar Babu |
Posani Krishnamurali
X

సత్తుపల్లి, దిశ : సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిపై జనసేన పార్టీ నాయకులు సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. జనసేనపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై, వారి కుటుంబంపై పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యాల పట్ల జనసేన పార్టీ సత్తుపల్లి పట్టణ అధ్యక్షుడు ఆళ్ల నరేష్, మండల అధ్యక్షుడు కొమ్మగిరి శరత్ ఆధ్వర్యంలో స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోసాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పోసాని ఒళ్లు దగ్గర పెట్టుకుని సోయితో వ్యవహరించాలని, స్థాయికి మించి మాట్లాడితే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జనసైనికుల మనోభావాలు దెబ్బతినేలా ఎవరు ప్రవర్తించినా ప్రతి స్పందన తీవ్రంగా ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సత్తుపల్లి, వేంసూరు మండలాల నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed