హుజూరాబాద్‌ బైపోల్: ఎలక్షన్ రిటర్నింగ్‌ అధికారిపై ఈసీకి ఫిర్యాదు

by  |
ec
X

దిశ, హుజూరాబాద్: సాకులు చూపుతూ తమను నామినేషన్లు వేయకుండా హుజూరాబాద్ ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి అడ్డుకుంటున్నారని.. కేంద్ర ఎన్నికల సంఘానికి టీఎస్ 61 రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ లింగయ్య మంగళవారం ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్‌లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరినప్పటికీ నామినేషన్ పత్రాలు ఇవ్వడానికి కుంటి సాకులు చూపుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నామినేషన్లు సమర్పించడానికి పత్రాలు అడిగిన వారితో అమర్యాదగా ప్రవర్తిస్తూ నిర్లక్ష్యమైన సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. పోలీస్ ఫోర్స్‌ను ఉపయోగించి నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్లిన అభ్యర్థులను అడ్డుకుంటున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై చర్యలు చేపట్టాలని లింగయ్య కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.



Next Story

Most Viewed