ఎమ్మెల్యే రసమయిపై బెజ్జంకి పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు

by  |
ఎమ్మెల్యే రసమయిపై బెజ్జంకి పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు
X

దిశ, హుస్నాబాద్: మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రధాని నరేంద్రమోడీ, ఎంపీ బండి సంజయ్‌కి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ బెజ్జంకి మండలాధ్యక్షులు ధోనే అశోక్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం బెజ్జంకి మండల కేంద్రంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఆయన మాట్లాడారు. దేశప్రధాని నరేంద్రమోడీ బాడకౌ వాడికి ఏం తెలుసు వడ్ల గురించి, గోధుమలు తినవు కదా అని అసభ్య పదజాలంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ నరేంద్రమోడీ పెంపుడు కుక్కని దుర్భాషలాడటం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసభ్యకర పదజాలంతో మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోని బహిరంగ క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి దొంతరవేని శ్రీనివాస్, అనిల్ రావు ముస్కు మహేందర్, రాజు, సత్యనారాయణ, వడ్లూరి శ్రీనివాస్, ఓబీసీ మోర్చా మండలాధ్యక్షులు బండిపల్లి సత్యనారాయణ, కార్యదర్శి వెంకటేశం, నూనె ఆంజనేయులు, తుమ్మల రమేష్, మల్లేశం, రవి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed