సరుకులు పంపిణీ చేసిన ఆహార భద్రతా కమిషనర్

by  |
సరుకులు పంపిణీ చేసిన ఆహార భద్రతా కమిషనర్
X

దిశ, మెదక్: లాక్‌డౌన్ సందర్భంగా పేద ప్రజలను ఆదుకునేందుకు ఆహార భద్రతా కమిషనర్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ తనవంతు సాయం అందించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని పేద కుటుంబాలకు సర్పంచ్ ద్యావనపల్లి మంజుల, శ్రీనివాస్‌‌తో కలిసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కారణంగా అనేకమంది పేదలు ఇబ్బందులకు గురవుతున్నారని, రెక్కాడితేగానీ డొక్కాడని రోజువారీ కూలీలు పస్తులు ఉండొద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఆపద సమయంలో దాతలు ముందుకు వచ్చి నిరుపేదలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.

Tags : Commissioner of Food Security, Distribution, goods, poor people, medak


Next Story